News March 29, 2024

విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు: విప్లవ్

image

TG: కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తన తండ్రి కే కేశవరావు నిర్ణయం బాధించిందని ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. ‘గతంలో పొన్నాల లక్ష్మయ్య వయసు గురించి సీఎం రేవంత్ విమర్శించారు. మరి 84 ఏళ్ల కేకేను ఎలా పార్టీలో చేర్చుకుంటారు? మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు. ఆయన ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. విజయలక్ష్మి బీఆర్ఎస్‌కు తీరని ద్రోహం చేశారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News December 20, 2025

సర్పంచ్ ఫలితాలు.. 18 మంది ఎమ్మెల్యేలపై PCC చీఫ్ అసంతృప్తి

image

TG: సర్పంచ్ ఫలితాల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదని 18 మంది MLAలపై AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్స్‌ను బుజ్జగించలేకపోవడం, బంధువులను నిలబెట్టడంతో పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహించారు. ఫలితాలపై CM రేవంత్ క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుని రివ్యూ చేశారు. కొంత మంది MLAలను పార్టీపరంగా మందలించేందుకు ఆ నివేదికను PCC చీఫ్‌కు పంపించగా ఇవాళ సమీక్ష నిర్వహించారు.

News December 20, 2025

అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. BSFలో 50 శాతం కోటా

image

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అగ్నివీరులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరుల కోటాను 10% నుంచి 50%కి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ మార్పులు ప్రస్తుతానికి BSFకే వర్తిస్తాయని, ఇతర కేంద్ర బలగాలకు కాదని స్పష్టం చేసింది. కాగా అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండగా, రాత పరీక్ష తప్పనిసరి అని పేర్కొంది.

News December 20, 2025

HISTORY: HYD నిజాం.. మస్క్ కంటే రిచ్!

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర ఆదాయం ఇటీవలే $677B దాటింది. కానీ ఇంతకంటే ఎక్కువ ఆదాయాన్ని 85ఏళ్ల క్రితమే HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కలిగి ఉండేవారని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 1937 నాటికే ఆయన సంపద విలువ నేటి లెక్కల ప్రకారం సుమారు ₹150 లక్షల కోట్లు ($1.8 ట్రిలియన్లు). అపారమైన భూములు, గోల్కొండ వజ్రాలు, రాజప్రాసాదాలతో అప్పట్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఆయన గుర్తింపు పొందారు.