News September 13, 2025
KNR: ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో వాడవాడలా బొడ్డెమ్మ పున్నం పండుగ ఘనంగా ప్రారంభమైంది. తీరొక్క పూలతో బొడ్డెమ్మను అలంకరించిన మహిళలు ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’ అంటూ ఆనవాయితీగా పాడుతున్న పాటలను ఆలకిస్తూ చప్పట్లు కొడుతూ గౌరమ్మను కొలుచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటే ఈ పండుగను జరుపుకోవండం ఎంతో సంతోషంగా ఉందని వనితలు అన్నారు.
Similar News
News September 13, 2025
రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

UAEలో జరుగుతోన్న ఆసియా కప్పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
News September 13, 2025
నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

మయన్మార్లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్లపై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.
News September 13, 2025
విజయవాడ-మచిలీపట్నం రహదారిపై యాక్సిడెంట్

మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి తారకటూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూటిపై వెళ్తున్న యువకులు ఇటుకల లోడుతో ఉన్నా ట్రాక్టర్ని ఢీకొట్టారన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందాగా మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.