News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

Similar News

News December 12, 2025

రాజీనామా చేయాలనుకుంటున్నా.. బంగ్లా ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్

image

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడిగా తనకున్న అధికారాలను తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ తొలగించారని షాబుద్దీన్ అన్నారు. సుమారు 7 నెలలుగా తనతో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని చెప్పారు. అన్ని దేశాలలోని బంగ్లా రాయబార కార్యాలయాల్లో తన ఫొటోను తొలగించారన్నారు. అవమానంగా ఉందని, ఎన్నికల తర్వాత తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

News December 12, 2025

నకిలీ కాఫ్ సిరప్ తయారీ.. ED సోదాలు

image

అక్రమ కాఫ్ సిరప్ తయారీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు కావడంతో ED సోదాలు చేస్తోంది. నిందితుడు శుభమ్ జైస్వాల్, అనుచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, ఝార్ఖండ్, గుజరాత్‌లోని 25 ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేస్తోంది. యూఏఈలో తలదాచుకుంటున్న జైస్వాల్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

News December 12, 2025

జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో వరుస <<18509568>>భూకంపాలు<<>> ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.