News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

Similar News

News December 7, 2025

సమ్మిట్ ఆహూతులకు స్పెషల్ బొనాంజా

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. 44 దేశాలనుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. రేపు 1.30కు సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు. CM 2.30కు ప్రసంగిస్తారు. TG సంస్కృతి, HYD ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. సమ్మిట్ ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేక సావనీర్, వివిధ పిండివంటలతో కూడిన బాస్కెట్‌ను ఆహూతులకు అందించనున్నారు.

News December 7, 2025

వర్చువల్ బ్రెయిన్‌ను తయారు చేసిన సూపర్‌కంప్యూటర్

image

బ్రెయిన్ పనితీరు, అల్జీమర్స్‌పై స్టడీకి సూపర్‌కంప్యూటర్ సహాయంతో సైంటిస్ట్స్ వర్చువల్ మౌస్ బ్రెయిన్‌ తయారు చేశారు. USలోని అలెన్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో-కమ్యూనికేషన్స్ జపాన్ ఎక్స్‌పర్ట్‌లు 9మిలియన్ న్యూరాన్లు, 26బిలియన్ల సినాప్సెస్‌తో చేసిన కార్టెక్స్‌ సెకనుకు క్వాడ్రిలియన్ లెక్కలు చేయగలదు. హ్యూమన్ బ్రెయిన్‌ కంటే ఎలుక మెదడు చిన్నది, తక్కువ సంక్లిష్టమైనదైనా చాలా పోలికలుంటాయి.

News December 7, 2025

పవన్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి(KN)లోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. ‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ భగవద్గీత ఓ సారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, సమస్యలకు పరిష్కారంగా మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.