News October 15, 2024
కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.
Similar News
News November 11, 2025
యాక్టివేటెడ్ చార్కోల్తో ఎన్నో లాభాలు

ప్రస్తుత కాలంలో ఫేస్ క్రీం, ఫేస్ వాష్ ఎందులో చూసినా యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటోంది. దీంతో చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. * ఇది ఓపెన్ పోర్స్ను అన్క్లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. * మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.
News November 11, 2025
బయో-కెమికల్ వార్: ఉగ్రసంస్థల కొత్త వ్యూహం

భారత్పై విషం చిమ్మేందుకు ఉగ్రసంస్థలు రూటు మార్చాయి. నిఘా, తనిఖీలు, సప్లై తదితర సవాళ్లు పెరగడంతో స్థానిక పదార్థాలతో నరమేధం సృష్టించే నైపుణ్యం గల వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. రసాయనాలు, వాటితో మంచి చెడులు వైద్యులకు తెలియడంతో వారినే పావులుగా మారుస్తున్నాయి. ఆముదాలతో రెసిన్ విషం తయారుచేస్తూ పట్టుబడ్డ HYD Dr. మొయిన్, ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్ యూరియాతో దొరికిన ముగ్గురు వైద్యులు ఇందుకు ఉదాహరణ.
News November 11, 2025
ప్రమాదం.. వ్యక్తిని కాపాడిన స్మార్ట్ వాచ్

మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడుతుందో తెలిపే ఘటనే ఇది. ఓ వ్యక్తికి తీవ్ర ప్రమాదం జరిగినప్పుడు అతడి చేతికి ఆపిల్ వాచ్ ఉంది. BP, పల్స్ పడిపోవడాన్ని వాచ్ గ్రహించి ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసింది. అతడి లొకేషన్ను కొడుకుకు & అంబులెన్స్కు హెచ్చరిక సందేశాన్ని పంపింది. బాధితుడు క్షేమంగా బయటపడ్డారు. అత్యవసర SOS ఫీచర్లు యాపిల్తో పాటు Samsung & Google Pixel వాచ్ల్లోనూ ఉన్నాయి.


