News October 14, 2024

కోహ్లీ ప్రపంచస్థాయి క్రికెటర్: గంభీర్

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘2008లో కోహ్లీ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడిపై నా అభిప్రాయం మారలేదు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్. శ్రీలంకపై తొలిమ్యాచ్‌లోనే ఆయనతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం నాకింకా గుర్తుంది. ఎప్పుడూ పరుగుల ఆకలితో ఉండటం ఆయన్ను దిగ్గజ క్రికెటర్‌ను చేసింది. NZ, AUS టెస్టు సిరీస్‌‌ల్లోనూ కోహ్లీ రాణిస్తారు’ అని తెలిపారు.

Similar News

News December 6, 2025

నిజమైన భక్తులు ఎవరంటే?

image

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>

News December 6, 2025

బంధం బలంగా మారాలంటే?

image

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్‌ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.

News December 6, 2025

అప్పుల భారతం.. ఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?

image

దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 2025లో కుటుంబ రుణాలు ₹15.7 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2018లో సగటున ఒక్కొక్కరిపై ₹3.4 లక్షల అప్పు ఉండగా, ఇప్పుడు ₹4.8 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు EMIలు కడుతున్నారు.