News March 3, 2025

బాబర్ ముందు కోహ్లీ జీరో: పాక్ మాజీ క్రికెటర్

image

CTలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మారడం లేదు. తాజాగా టీమ్ ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. ‘బాబర్ ఆజమ్‌తో పోలిస్తే కోహ్లీ జీరో. బాబర్ గణాంకాలతో కోహ్లీకి పోలికా? ఇలాంటి విషయాల గురించి చర్చించడం దండగ. ప్రస్తుతం పాక్ క్రికెట్ గురించి చర్చించాలి. మన జట్టుకు ప్రణాళికలు, వ్యూహాలు, జవాబుదారీతనం లేవు. తిరిగి గాడిన పడాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపు

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్‌ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్‌కు సూచించారు.

News March 20, 2025

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPL ఫ్యాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR, RCBకి మధ్య ఎల్లుండి జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు 90శాతం మేర ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకుంటాయి.

error: Content is protected !!