News April 11, 2024

కోహ్లీ-రోహిత్ పోరు.. ఆధిపత్యం ఎవరిదంటే?

image

IPL2024లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీమ్ఇండియా తరఫున అదరగొట్టే రోహిత్-కోహ్లీ ద్వయం పొట్టి లీగ్‌లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. RCBపై రోహిత్ శర్మ 574 పరుగులు చేయగా.. MIపై విరాట్ కోహ్లీ 852 పరుగులు చేశారు. ఆర్సీబీపై అత్యధికంగా బుమ్రా 24 వికెట్లు తీశారు. కాగా వాంఖడేలో ఈ 2జట్లు ఇప్పటివరకు 10సార్లు తలపడగా ముంబై 7,ఆర్సీబీ 3సార్లు విజయం సాధించాయి. మరి ఈరోజు గెలుపెవరిది?

Similar News

News April 7, 2026

దాడులు చేయబోతున్నాం, జాగ్రత్త.. ఇజ్రాయెల్ వార్నింగ్

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఆ దేశంలోని రైల్వే వ్యవస్థపై దాడులు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు రాత్రి 9 గంటల (ఇరాన్ కాలమానం ప్రకారం) వరకు ప్రజలెవరూ రైళ్లలో ప్రయాణించవద్దని, ట్రాక్స్ దగ్గర ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలు రిస్కులో పడతాయని స్పష్టం చేసింది. కాగా టెహ్రాన్‌తో పాటు IRGC కార్యాలయాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది.

News April 7, 2026

అల్లు అర్జున్- అట్లీ మూవీ నుంచి అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘AA22xA6’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు 11AMకి టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

News April 7, 2026

చిరంజీవి చొరవ చూపాలి: కేశినేని చిన్ని

image

AP: గత ప్రభుత్వం సినీ పరిశ్రమను హింసిస్తే తాము ఎంతో గౌరవిస్తున్నామని MP కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ‘అవసరమైనప్పుడు ఇండస్ట్రీతో చర్చిస్తాం. ఇందుకు చిరంజీవి చొరవ చూపాలి. టాలీవుడ్‌కు 65% ఆదాయం వచ్చే APలో కనీసం 25% షూటింగ్స్ జరిపితే బాగుంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.