News May 26, 2024

అమెరికాకు వెళ్లని కోహ్లీ.. కారణమిదే

image

టీ20 వరల్డ్‌కప్ కోసం టీమ్‌ఇండియా ఫస్ట్ బ్యాచ్ అమెరికాకు బయల్దేరింది. పేపర్ వర్క్ పెండింగ్‌లో ఉండటం వల్ల కోహ్లీ న్యూయార్క్‌కి వెళ్లలేకపోయారని, ఈనెల 30న వెళ్తారని క్రీడావర్గాలు తెలిపాయి. రోహిత్, జడేజా, బుమ్రా, సూర్య, దూబే, పంత్, కుల్దీప్, అక్షర్, అర్ష్‌దీప్, సిరాజ్‌తో పాటు రిజర్వ్‌డ్ ప్లేయర్స్ గిల్, ఖలీల్ ఫస్ట్ బ్యాచ్‌లో వెళ్లిన వారిలో ఉన్నారు. వీరితో కోచ్ ద్రవిడ్‌, ఇతర స్టాఫ్ కూడా పయనమయ్యారు.

Similar News

News February 13, 2025

తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.

News February 13, 2025

ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు

image

ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్‌ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.

News February 13, 2025

19న BRS విస్తృతస్థాయి సమావేశం

image

TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.

error: Content is protected !!