News March 30, 2024
కోహ్లీ ప్రపంచ రికార్డు
నిన్న చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరిగిన మ్యాచ్లో 83* రన్స్ చేసిన విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో అత్యధిక T20 రన్స్(3,276) చేసిన ఆటగాడిగా నిలిచారు. 3,239 పరుగులతో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్-మీర్పూర్) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్(ట్రెంట్ బ్రిడ్జ్-3,036 రన్స్), బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్(మీర్పూర్-3,020 పరుగులు) ఉన్నారు.
Similar News
News October 5, 2024
MGR వీరాభిమానులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ‘ఏఐఏడీఎంకే’ ఏర్పాటై ఈ నెల 17కు 53ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు MGR ఫ్యాన్స్కు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పురచ్చి తలైవర్’ MGRపై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు. పవన్ను వ్యతిరేకిస్తున్న డీఎంకే సర్కారుకు చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
News October 5, 2024
ఇలా చేస్తే వాహనదారులకు రాయితీ!
TG: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా మార్చే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ కింద బైక్స్కు లైఫ్ ట్యాక్స్లో ₹1,000-₹7,OOO, 4 వీలర్స్కు ₹15,000-₹50,000 రాయితీని కల్పించనుంది. కొత్తగా కొనే వాహనాల విలువను బట్టి డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఇది వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు వేర్వేరు విధాలుగా వర్తించనుంది. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.
News October 5, 2024
సెబీ చీఫ్ మాధబీ, ట్రాయ్ చీఫ్ లాహోటిలకు సమన్లు
సెబీ, ట్రాయ్ల పనితీరుపై పార్లమెంటు PAC ఈ నెల 24న సమీక్షించనుంది. ఈ మేరకు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటిలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమీక్షకు రెండు సంస్థల నుంచి మాదబీ, లాహోటిల తరఫున సీనియర్ అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కమిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఈ సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది.