News May 24, 2024
KTR, RSP క్షమాపణలు చెప్పాలి: జూపల్లి

TG: BRS హత్యారాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని, కుటుంబ తగాదాల వల్లే ఆయనను హత్య చేశారన్నారు. హత్యలకు, రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని.. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వారు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 16, 2025
సోషల్ మీడియాలో వేధింపులా..

టెక్నాలజీ లైఫ్ని ఎంత ఈజీ చేసిందో.. దాంతో పాటు కొన్ని సమస్యలు కూడా తెచ్చింది. వాటిల్లో ఒకటి ఆన్ లైన్ వేధింపులు. వీటిని తగ్గించాలంటే..సోషల్మీడియా ఖాతాలకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి. అనుమానాస్పద ఖాతాలు కనిపిస్తే వాటిని వెంటనే బ్లాక్ చేసి.. రిపోర్టు చేయాలి. సోషల్మీడియా ఖాతాల ఐడీ, పాస్వర్డ్స్ ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరైనా వేధింపులకు దిగితే.. సందేశాలను స్క్రీన్షాట్స్ తీసుకోండి.
News November 16, 2025
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News November 16, 2025
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.


