News October 23, 2024
కాసేపట్లో కోర్టుకు కేటీఆర్
TG: మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ వేసిన ఆయన అందుకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. దీంతో విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మరోవైపు తమ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సురేఖపై హీరో నాగార్జున కూడా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 23, 2024
బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీస్
TG: కేంద్రమంత్రి బండి సంజయ్కి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడని సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
News October 23, 2024
కాంగ్రెస్లో చేరిన BRS MLAలపై వేటు వేయాలి: జీవన్ రెడ్డి
TG: తన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మరోసారి <<14421491>>అధిష్ఠానంపై<<>> హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో చేరిన BRS MLAలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని, ఎవరైనా ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలనే చట్టం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్కు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఎంఐఎంను మినహాయించినా సుస్థిరంగా ఉంటుందన్నారు.
News October 23, 2024
నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీ
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆమె నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. మరికాసేపట్లో ఆమె రోడ్షోలో పాల్గొంటారు.