News March 17, 2025

అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

Similar News

News January 20, 2026

డిజాస్టర్‌గా ‘రాజాసాబ్’?

image

రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాజాసాబ్’ థియేట్రికల్ రన్‌ను డిజాస్టర్‌గా ముగించనుంది. JAN 9న విడుదలైన మూవీ 55% వసూళ్లతో బిజినెస్ క్లోజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్లలో 20% ఆక్యుపెన్సీ కూడా ఉండట్లేదని పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచేందుకు ఇంకా రూ.90కోట్లు(నెట్) రావాలన్నాయి. మరోవైపు OTT డీల్ ఆశించినంత మేర జరగలేదని ప్రొడ్యూసర్ పేర్కొన్నారని చెప్పాయి.

News January 20, 2026

స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

image

ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్​ చేయడం వల్ల కండరాలు పటిష్ఠడతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్​ చేయడం ద్వారా డోపమైన్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది.

News January 20, 2026

72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

image

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.