News November 20, 2024
కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: రేవంత్

TG: లగచర్లలో కొందరిని ఉసిగొల్పి అధికారులపై దాడులు చేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు. రెచ్చగొట్టి, దాడులు చేసిన వాళ్లను శిక్షించొద్దా? పరిశ్రమలకు బీఆర్ఎస్ అడ్డుపడుతోంది. నేను అడిగింది లక్ష ఎకరాలు కాదు, వెయ్యి ఎకరాలే. గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు పెడతామంటే అడ్డుకుంటున్నారు’ అని వేములవాడ సభలో రేవంత్ మండిపడ్డారు.
Similar News
News February 4, 2026
అదే రోజున ఓటీటీలోకి MSVPG ఏడు భాషల్లో రిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్గారు’ చిత్రం త్వరలో OTTలో సందడి చేయనుంది. ఇప్పటికే OTT సంస్థ జీ5 దీనిపై అనౌన్స్మెంట్ ఇచ్చినా డేట్ కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.
News February 4, 2026
అసభ్యకరంగా కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె అతడి ఐడీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ వేధింపులపై ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు.
News February 4, 2026
ఐఐటీ గోవాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


