News November 20, 2024

కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: రేవంత్

image

TG: లగచర్లలో కొందరిని ఉసిగొల్పి అధికారులపై దాడులు చేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు. రెచ్చగొట్టి, దాడులు చేసిన వాళ్లను శిక్షించొద్దా? పరిశ్రమలకు బీఆర్ఎస్ అడ్డుపడుతోంది. నేను అడిగింది లక్ష ఎకరాలు కాదు, వెయ్యి ఎకరాలే. గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు పెడతామంటే అడ్డుకుంటున్నారు’ అని వేములవాడ సభలో రేవంత్ మండిపడ్డారు.

Similar News

News March 16, 2026

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

image

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

News March 16, 2026

భారత్‌కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

image

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.

News March 16, 2026

టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

image

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.