News November 19, 2024

రాష్ట్రపతి దృష్టికి లగచర్ల ఘటన

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వ్యవహారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు చేరింది. ఆమె అపాయింట్‌మెంట్ కోసం లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి భూసేకరణకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, జాతీయ మానవహక్కుల కమిషన్‌లను కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 24, 2025

కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

image

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.

News November 24, 2025

అధిక ధరలకు అమ్మితే కాల్ చేయండి!

image

బస్‌స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల కొందరు MRP కంటే అధిక ధరలకు వస్తువులు అమ్ముతుంటారు. అలాంటి సమయంలో ప్రశ్నించడం వినియోగదారుడిగా నీకున్న హక్కు. ఒకవేళ ఎవరైనా అధిక ధర వసూలు చేస్తే అది చట్ట ప్రకారం నేరం. ఇలాంటి మోసాలను వెంటనే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నం.1915కు కాల్ లేదా WhatsApp No 8800001915కు మెసేజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. SHARE IT

News November 24, 2025

CBN కోసం పవన్ డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

image

AP: తిరుమల <<18376126>>లడ్డూ వివాదం<<>>పై Dy.CM పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజాగ్రహం నుంచి చంద్రబాబును కాపాడేందుకు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర, నష్టపరిహారం కోసం పోరాడాల్సిందిపోయి.. పొలిటికల్ డ్రామాలోకి తిరుమలను, లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. తప్పుడు ప్రచారం, ప్రజలను నమ్మించడంలో CBN, పవన్ నిపుణులు. గోబెల్స్‌ను మించిపోయారు’ అని ఫైరయ్యారు.