News March 8, 2025
వనువాటు పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ.. ప్రత్యేకతలివే!

గత కొన్నేళ్లుగా UKలో ఉంటున్న IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ‘వనువాటు’ దేశ పౌరసత్వం తీసుకున్నారు. 80 ద్వీపాల సమూహమైన ఈ దేశం పసిఫిక్ seaలో ఉంటుంది. అక్కడ IT సహా ఇతర ట్యాక్స్లు ఉండవు. క్రిప్టో హబ్గా ఈ కంట్రీ వృద్ధి చెందుతోంది. 2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్లో తొలి ప్లేస్లో నిలిచింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్, INDలో దర్యాప్తును తప్పించుకునేందుకే ఈ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 28, 2026
యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధంతో అనేక దేశాల్లో ఆహారం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని PM మోదీ తెలిపారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌరులంతా ఐక్యంగా, ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. భయాందోళనలు రేకిత్తించే తప్పుడు ప్రచారాలు చేయొద్దని పార్టీలకు హితవు పలికారు. నోయిడా(UP)లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తొలి దశను ఆయన ప్రారంభించారు.
News March 28, 2026
గంభీర్ ఫొటోలు వాడొద్దు: హైకోర్టు

టీమ్ఇండియా కోచ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్స్టా, గూగుల్ సహా ఇతర SM ప్లాట్ఫామ్స్ను ఆదేశించింది. ఈ కంటెంట్ను క్రియేట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
News March 28, 2026
TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>


