News March 8, 2025

వనువాటు పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ.. ప్రత్యేకతలివే!

image

గత కొన్నేళ్లుగా UKలో ఉంటున్న IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ‘వనువాటు’ దేశ పౌరసత్వం తీసుకున్నారు. 80 ద్వీపాల సమూహమైన ఈ దేశం పసిఫిక్ seaలో ఉంటుంది. అక్కడ IT సహా ఇతర ట్యాక్స్‌లు ఉండవు. క్రిప్టో హబ్‌గా ఈ కంట్రీ వృద్ధి చెందుతోంది. 2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో తొలి ప్లేస్‌లో నిలిచింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్, INDలో దర్యాప్తును తప్పించుకునేందుకే ఈ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 22, 2025

AP న్యూస్ రౌండప్

image

✒ పలు జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఆస్కారం.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని Dy.CM పవన్ ఆదేశాలు
✒ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ఈ నెల 23న తమ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ: YCP
✒ ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తి: మంత్రి పార్థసారథి
✒ అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం: చెల్లుబోయిన వేణు

News October 22, 2025

ఐఫోన్‌కు బదులు ఐక్యూ మొబైల్.. అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

image

AP: అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్జూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరేశ్ ఇటీవల అమెజాన్‌లో రూ.80వేలతో ఐఫోన్ 15+ ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా స్పందించకపోవడంతో కన్జూమర్ ఫోరాన్ని సంప్రదించాడు. బాధితుడికి ఐఫోన్‌ డెలివరీ చేయని పక్షంలో రూ.80వేల రీఫండ్‌తో పాటు మరో రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను NOV 21కి వాయిదా వేసింది.

News October 22, 2025

శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

image

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.