News September 20, 2024
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్

మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్లో ఈ మ్యాచులను చూడవచ్చు.
Similar News
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<
News November 9, 2025
పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.


