News May 7, 2025
పిల్లల ఆపరేషన్ ఉంది ఉండనివ్వండి.. పాకిస్థానీ వేడుకోలు

తన పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. పుట్టుక నుంచి పిల్లలు గుండె సమస్యతో బాధ పడుతున్నారని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు పాకిస్థానీలు భారత్ నుంచి వెళ్లాలని ఆదేశించడంతో ఆపరేషన్ కాకుండానే వెళ్లాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చికిత్స కోసం ₹కోటి ఖర్చైందని, ఆపరేషన్ జరిగేలా చూసి పిల్లల ప్రాణాలు కాపాడాలని అభ్యర్థిస్తున్నాడు.
Similar News
News March 7, 2026
28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్లిస్ట్ను తపాలా శాఖ <
News March 7, 2026
ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.
News March 7, 2026
పెరిగిన ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజులు

TG: ప్రైవేటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-28 విద్యాసంవత్సరానికి బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు, ఫార్మాడీకి రూ.1.37లక్షలుగా నిర్ధారించింది. గతంతో పోలిస్తే 10-15% పెరిగింది. కనిష్ఠ ఫీజును రూ.45వేలకు పరిమితం చేసింది. అయితే మెజార్టీ కాలేజీల్లో ఫీజులు రూ.50-80వేల మధ్య ఉన్నాయి. ఇక ఆర్కిటెక్చర్ ఫీజును గరిష్ఠంగా ₹1.32లక్షలుగా సర్కార్ నిర్ణయించింది.


