News March 10, 2025

ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

image

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.

Similar News

News October 21, 2025

నలుగురి గురించి ఆలోచిస్తూ ఉంటే..!

image

నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇది వ్యక్తిగత పురోగతికి ప్రధాన అడ్డంకి అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయం వల్ల అనేక వినూత్న ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాల్చక, మన మనసులోనే చనిపోతున్నాయని చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే మనం పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలమని సూచిస్తున్నారు. సొంత ఆలోచనలపై నమ్మకముంచి, నిస్సంకోచంగా ముందుకు సాగడమే విజయానికి తొలిమెట్టు అని నిపుణులు తెలిపారు.

News October 21, 2025

కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

image

బిహార్‌లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.

News October 21, 2025

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా: కేటీఆర్

image

TG: తమ పార్టీలో ఉన్నామంటున్న MLAల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి సిగ్గుందా?’ అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కరప్షన్ కమిటీ అని, దానికి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులని ఖైరతాబాద్‌లో బస్తీ దవాఖానా సందర్శన సందర్భంగా KTR విమర్శించారు.