News May 11, 2024
రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా!

AP: ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. కేవలం నగదు పంపిణీనే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నియోజకవర్గంలో మందుబాబులకు రూ.10 నోటు, మహిళలకు రూ.50 నోటును టోకెన్లుగా ఇచ్చారట. ఇవి చూపిస్తే క్వార్టర్ బాటిల్, బియ్యం బస్తాలు అందిస్తున్నారనే సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ గోదాములో 3లారీల బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 23, 2026
350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 23, 2026
నేడు శ్రీవారి పలు దర్శన టోకెన్లు విడుదల

AP: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి సంబంధించి పలు సేవల టోకెన్లు ఇవాళ రిలీజ్ కానున్నాయి. శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా ఉదయం 10గంటలకు TTD విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టోకెన్లు 3pmకు విడుదల చేయనున్నారు. అటు అధికారిక వెబ్సైట్ను ఫాలో కావాలని, దళారులను నమ్మొద్దని TTD హెచ్చరిస్తోంది.
News January 23, 2026
AP SETకు అప్లై చేశారా?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET-2025)కు అప్లై చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు పోటీ పడేందుకు సెట్ అర్హత తప్పనిసరి. పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: www.apset.net.in


