News February 11, 2025
తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు.. వివరాలివి

మద్యం ధరలను పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాలు మందు బాబులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్ ధరలు తప్ప అన్ని బ్రాండ్ల మద్యం బాటిళ్లపై రూ.10లను ఎక్సైజ్ శాఖ పెంచింది. అటు తెలంగాణలో కేవలం బీర్ల ధరలనే పెంచారు. అన్నిరకాల బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 15% ధరలు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
Similar News
News March 15, 2025
నటి రన్యా రావు తండ్రిపై ప్రభుత్వం చర్యలు!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమె సవతి తండ్రి, హౌసింగ్ కార్పొరేషన్ DGP రామచంద్రారావును సెలవుల్లో పంపింది. ఆయన స్థానంలో కె.వి.శరత్ చంద్రను నియమించింది. మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా తనను కొట్టి తెల్ల కాగితాలపై పోలీసులు సంతకాలు చేయించుకున్నారని రన్యా రావు ఆరోపించారు.
News March 15, 2025
మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.
News March 15, 2025
కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR

AP: పూర్వం కోటల్లో రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని, రాజ్యం ఎలా ఉన్నా ఆహా రాజా! ఓహో రాజా అంటూ తమ ఆటలు సాగించుకునేవారని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని ట్వీట్ చేశారు. ‘కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోటా మిగలదు’ అని పేర్కొన్నారు. ఇటీవల జగన్ చుట్టూ కోటరీ ఉందని VSR ఆరోపించిన విషయం తెలిసిందే.