News August 21, 2025

లిక్కర్ స్కాం: రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి

image

AP: మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆస్తులు జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సీఐడీ అభియోగం మోపింది.

Similar News

News August 21, 2025

సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమెకు వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు పయనమవుతారు.

News August 21, 2025

NDAకు మద్దతు ఇస్తున్నాం: బొత్స

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నంబర్ గేమ్ ఉండొద్దనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి తాము మద్దతిచ్చినట్లు బొత్స గుర్తుచేశారు. తమది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని ఆయన వివరించారు.

News August 21, 2025

నివేదిక రద్దు చేయాలని పిటిషన్లు.. విచారణ వాయిదా

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న <<17470256>>కేసీఆర్<<>>, హరీశ్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరగా, విచారణ రేపటికి వాయిదా పడింది.