News May 10, 2024

రేపు సాయంత్రం నుంచి మద్యం షాప్‌లు బంద్

image

తెలంగాణలో రేపు సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్‌లు బంద్ కానున్నాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు సా.5 నుంచి 13వ తేదీ సా.6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Similar News

News November 21, 2025

క్లాస్‌రూమ్ టు అసెంబ్లీ.. యువ ‘ఎమ్మెల్యే’ టీమ్ ఇదే!

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఈనెల 26న నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి అనంతపురం జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో విద్యార్థి ఎంపికయ్యారు. ఎమ్మెల్యేలా వారు అసెంబ్లీలో పాల్గొంటారు.
★ ఎంపికైన వారి వివరాలు ఇలా.. అనంతపురం-సదాఫ్ నాజ్, రాప్తాడు- శ్రీనిత్ రెడ్డి, రాయదుర్గం-గంగోత్రి, ఉరవకొండ-లోకేశ్, గుంతకల్లు-స్వప్న, తాడిపత్రి-అనిల్ కుమార్, శింగనమల-శిరీష, కళ్యాణదుర్గం- తలారి అభిజ్ఞ.

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.