News March 9, 2025
లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.
Similar News
News November 28, 2025
వరంగల్ MGMలో లంచగొండిలు.. ఒకరి తొలగింపు

MGM ఆసుపత్రిలో తల వెంట్రుకలను తొలగించడానికి ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లంచం అడిగి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లాకు చెందిన ఓ మహిళ తన బంధువు సర్జరీ కొసం రాగా, వెంట్రుకలను తొలగించానికి సదరు ఉద్యోగి శీను డబ్బులు అడిగాడు. లంచగొండిని పట్టించాలనే ఉద్దేశ్యంతో ఆమె డబ్బులు ఇస్తున్న సమయంలో ఫోన్లో వీడియోతీసి ఉన్నతాధికారులకు పంపింది. దీంతో ఆ ఉద్యోగిని తొలగించారు. మరో మేల్ నర్సు లంచం వ్యవహారంపైనా విచారణ జరుగుతోందట.
News November 28, 2025
డిసెంబర్ 1న గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిని డిసెంబర్ 1న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. రూ.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని పొడవు 55 మీటర్లు. ఒకే సమయంలో 100 మంది బరువును ఈ గ్లాస్ బ్రిడ్జి మోయగలదు. అయితే ముందు జాగ్రత్తగా 40 మంది చొప్పున బ్యాచ్లను అనుమతించనున్నారు. విశాఖకు పర్యాటకులు ఎక్కువమంది వచ్చే సీజన్ కావడంతో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.


