News February 5, 2025
ఏపీ అసెంబ్లీకి లోక్సభ స్పీకర్

AP: అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు MLA, MLCలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా, ఒక సెషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Similar News
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘విశ్వేశ్వర’’

విశ్వం అంటే అనంతమైన బ్రహ్మాండం. ఈశ్వర అంటే పాలకుడు. ఈ సృష్టిలోని ప్రతి అణువుకూ, ప్రతి జీవికీ శివుడే ఆధారం. కాలాతీతుడైన ఆయన సమస్త లోకాలను శాసిస్తాడు. కాశీలో ఆయన ‘విశ్వేశ్వరుడు’గా కొలువై భక్తులకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కాశీలో మరణించే ప్రతి జీవి చెవిలో ఆయన తారక మంత్రాన్ని ఉచ్ఛరించి ముక్తిని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ కాబట్టి ఆయన ‘విశ్వేశ్వరుడు’.
News February 13, 2026
బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయండి: అవామీ లీగ్

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని నిషేధిత అవామీ లీగ్ పార్టీ డిమాండ్ చేసింది. నియంత యూనస్ నిర్వహించిన ఈ ఎలక్షన్స్ హాస్యాస్పదమని పేర్కొంది. నిన్న 3 గంటల వ్యవధిలో 14.96% ఓటింగ్ నమోదవ్వడం ప్రజా వ్యతిరేకతను చూపించిందని ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో అవామీ లీగ్ మద్దతుదారులపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాహిత ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరింది.
News February 13, 2026
త్వరలో మెస్ ఛార్జీలు పెంపు: మంత్రి సవిత

AP: బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాల్లో త్వరలోనే మెస్ ఛార్జీలు పెంచనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నోడల్ శాఖ ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2014-19 మధ్య కాలంలోనూ అప్పటి TDP ప్రభుత్వం 66% మేర మెస్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు.


