News November 22, 2024

స్కూళ్ల సమయం పెంపుపై లోకేశ్ క్లారిటీ

image

AP: స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు MLAలు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన అన్నారు. పైలట్ ప్రాజెక్టుగానే అమలు చేస్తున్నామని, ఫీడ్ బ్యాక్‌కు తగ్గట్లు సమయం మార్చుతామని తెలిపారు. హైస్కూళ్లు ఉదయం 9- 4గంటల వరకు పని చేస్తుండగా, 5వరకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని 2స్కూళ్లలో ఇది అమలు అవుతోంది.

Similar News

News December 1, 2025

భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

image

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.

News December 1, 2025

1383 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

దేశవ్యాప్తంగా ఉన్న AIIMS హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్, BE, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-4(CRE-4)2025 ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్. https://aiimsexams.ac.in/

News December 1, 2025

కేరళ సీఎంకు ED నోటీసులు

image

2019 మసాలా బాండ్ల జారీ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ED నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌కు నోటీసులిచ్చింది. రూ.468 కోట్ల ట్రాన్సాక్షన్స్‌లో ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించే ప్లాన్‌లో భాగంగా ఈ బాండ్లను జారీ చేశారు.