News April 18, 2024

ఈ రోజు లోకేశ్ ముసుగు తొలగిపోతుంది: వైసీపీ

image

AP: ఎన్నికల వేళ విమర్శలు, ఆరోపణలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గురించి సంచలన విషయాన్ని బయట పెట్టబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘పప్పు పులకేశ్ అబద్ధాల గురించి చెప్పబోతున్నాం. ఇవాళ అతని మాస్క్ తొలగిపోతుంది. లోకేశ్ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు’ అని రాసుకొచ్చింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 13, 2025

15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

image

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 13, 2025

మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

image

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీ‌స్‌తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ లవ్‌స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5

News December 13, 2025

వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

image

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్‌గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.