News January 26, 2025
విదేశీయులకు పద్మాలు.. అమెరికాకే అత్యధికం

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకీ(వ్యాపారం-జపాన్)కి పద్మవిభూషణ్, వినోద్ ధామ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్-USA)కు పద్మభూషణ్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి ఒక్కరి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా USA నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి.
Similar News
News February 15, 2025
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.
News February 15, 2025
వంశీ ఫోన్ కోసం ఇంట్లో సోదాలు

హైదరాబాద్ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఆయన ఫోన్ కీలకం కావడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అది చేతికి వస్తేనే ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.
News February 15, 2025
ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

సోషల్ మీడియా దిగ్గజం ‘ఇన్స్టాగ్రామ్’లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. రెడ్డిట్లో అప్ఓట్, డౌన్ఓట్ ఉన్నట్లు ఇన్స్టాలోనూ పోస్టు కింద చేసిన కామెంట్ నచ్చకపోతే డిస్ లైక్ చేసే ఫీచర్ తీసుకొచ్చేందుకు ‘మెటా’ యోచిస్తోంది. యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇన్స్టా కామెంట్ సెక్షన్లో లవ్(లైక్) బటన్ మాత్రమే ఉంది.