News December 25, 2024
అల్పపీడనం ఎఫెక్ట్.. వర్షాలతో భారీ నష్టం
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీటి పాలైనట్లు రైతులు వాపోయారు. అటు TGలోని భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం, ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీటి పాలైందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
Similar News
News January 24, 2025
మొన్న చిలుకూరులో.. నేడు దోమకొండలో ప్రియాంక పూజలు
TG: హీరోయిన్ ప్రియాంకా చోప్రా కామారెడ్డి(D) దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయంలో పూజలు చేశారు. హీరో రామ్చరణ్ మామ వంశస్థులకు చెందినదే ఈ దోమకొండ గడికోట. ‘జంజీర్’ మూవీ సమయంలో గడికోట గురించి ప్రియాంకకు చెర్రీ, ఉపాసన చెప్పడంతో తాజాగా ఆమె అక్కడికి వెళ్లారు. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయాన్నీ ప్రియాంక దర్శించుకున్నారు. రాజమౌళి-మహేశ్ సినిమాలో నటించేందుకు ఆమె HYD వచ్చినట్లు తెలుస్తోంది.
News January 24, 2025
ఎల్లుండి రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ విడుదల
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈనెల 26న చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ మీర్పేట్లో భార్యను కిరాతకంగా నరికి <<15241806>>ముక్కలు ఉడికించిన <<>>కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి DNA శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల DNAతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు.