News May 12, 2024

విధేయతే కోహ్లీ రాయల్టీ: RCB

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇవాళ ఐపీఎల్‌లో 250వ మ్యాచ్ ఆడనున్నారు. ఒకే ఫ్రాంచైజీ(RCB)కి ఇన్ని మ్యాచ్‌లు ఆడటం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో మేనేజ్‌మెంట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను Xలో పోస్టు చేసింది. కోహ్లీకి విధేయతే రాయల్టీ అని రాసుకొచ్చింది. విరాట్ RCB తరఫున 7,897 పరుగులు(131.6 స్ట్రైక్ రేటు, 38.7 యావరేజ్) చేశారు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 264 సిక్సులు, 698 ఫోర్లు బాదారు.

Similar News

News September 14, 2025

IOCLలో 523 అప్రెంటిస్‌లు

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(<>IOCL<<>>) 523 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అక్టోబర్ 11వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 14, 2025

వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు?

image

వాటర్ క్యాన్‌లను కొందరు నెలలకొద్దీ, మరికొందరు ఏళ్ల పాటు వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని, 3 నెలలే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే క్యాన్లలో ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, TDS 50-150ppm మధ్య ఉండే నీటినే తీసుకోవాలని, ఎక్కువున్న నీటిని తాగితే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

News September 14, 2025

ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

image

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.