News May 12, 2024

విధేయతే కోహ్లీ రాయల్టీ: RCB

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇవాళ ఐపీఎల్‌లో 250వ మ్యాచ్ ఆడనున్నారు. ఒకే ఫ్రాంచైజీ(RCB)కి ఇన్ని మ్యాచ్‌లు ఆడటం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో మేనేజ్‌మెంట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను Xలో పోస్టు చేసింది. కోహ్లీకి విధేయతే రాయల్టీ అని రాసుకొచ్చింది. విరాట్ RCB తరఫున 7,897 పరుగులు(131.6 స్ట్రైక్ రేటు, 38.7 యావరేజ్) చేశారు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 264 సిక్సులు, 698 ఫోర్లు బాదారు.

Similar News

News November 28, 2025

వనపర్తి: ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు: పరిశీలకులు

image

వనపర్తి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు సూచించారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎంసీసీ) తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం

News November 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.