News April 11, 2025

మేడం బిల్లు కట్టరు..కానీ విమర్శిస్తారు: మంత్రి

image

BJP ఎంపీ కంగనా రనౌత్ రెండు నెలలుగా <<16040761>>కరెంట్ <<>>బిల్లు కట్టలేదని కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. మేడం బిల్లు కట్టరు పైగా బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అల్లరి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తాను ఇంట్లో ఉండకున్నా రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ సిగ్గుపడాలని, కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 22, 2025

HNK: బావ ఇంటికి బావమరిది కన్నం

image

బావ ఇంట్లో దొంగతనం చేసిన బావమరిదిని HNK జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐలవేని సాయి రోహిత్‌ (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆరు నెలల కిందట బావ బూతగడ్డ సతీష్‌ ఇంట్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నాడు. అతడి వద్ద నుంచి రూ. 4.36 లక్షల విలువైన 47.05 గ్రా. బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.

News November 22, 2025

‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్‌ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్‌ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్‌ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.