News July 15, 2024
గిన్నిస్ రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటిన టీమ్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈనెల 13, 14 తేదీల్లో ఇండోర్లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ X వేదికగా వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్స్ ధ్రువపత్రం ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అస్సాం అటవీశాఖ పేరిట ఉండేది. గత ఏడాది ఆ రాష్ట్రం 9లక్షలకుపైగా మొక్కల్ని నాటింది.
Similar News
News September 17, 2025
కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
News September 17, 2025
ASIA CUP: పాక్-UAE మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

తమ మ్యాచ్కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించాలన్న పాక్కు ICC షాక్ ఇచ్చింది. పాక్-UAE మ్యాచ్కు అతడినే రిఫరీగా కొనసాగిస్తోంది. మరోవైపు హ్యాండ్ షేక్ వివాదంపై పైక్రాఫ్ట్ తాజాగా తమకు క్షమాపణ చెప్పాడని పీసీబీ క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం. అటు మ్యాచులో పాక్కు UAE షాక్ ఇస్తోంది. తొలి ఓవర్లో ఓపెనర్ అయూబ్ను డకౌట్గా వెనక్కి పంపింది. పాక్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది.
News September 17, 2025
హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. UPలోని ఘజియాబాద్లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.