News July 15, 2024
గిన్నిస్ రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటిన టీమ్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈనెల 13, 14 తేదీల్లో ఇండోర్లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ X వేదికగా వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్స్ ధ్రువపత్రం ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అస్సాం అటవీశాఖ పేరిట ఉండేది. గత ఏడాది ఆ రాష్ట్రం 9లక్షలకుపైగా మొక్కల్ని నాటింది.
Similar News
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
బేబీ మసాజ్కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


