News September 11, 2024

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న మదర్సాలు: NCPCR

image

మదర్సాల్లో విద్యాబోధన సమగ్రంగా లేదని NCPCR తెలిపింది. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమంది. UP మదర్సా బోర్డుపై అలహాబాద్ హైకోర్టిచ్చిన తీర్పుపై సవాల్ పిటిషన్ నేపథ్యంలో అఫిడవిట్ సమర్పించింది. ‘మెరుగైన విద్యను పొందే హక్కును మదర్సాలు కాలరాస్తున్నాయి. పిల్లల ఎదుగుదలకు అవసరమైన వాతావరణం, అవకాశాలు అక్కడ లేవు. పైగా ముస్లిమేతరులకు ఇస్లామిక్ విద్యను అందిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి’ అని పేర్కొంది.

Similar News

News December 1, 2025

గర్భిణుల్లో వికారానికి కారణమిదే..

image

ప్రెగ్నెన్సీలో వికారం కామన్. అయితే ఇది గర్భంలోని శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి, హానికర పదార్థాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. శిశువు DNAలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్‌ బాడీగా భావిస్తుంది. కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేనిమీదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.

News December 1, 2025

దేవుడు మీకేం ఇవ్వలేదని బాధపడుతున్నారా?

image

పురాణాల్లో దేవుడు కొందరికి ఎన్నో గొప్ప వరాలిచ్చాడని, మాకేం ఇవ్వలేదని కొందరు బాధ పడుతుంటారు. కానీ సమస్త మానవాళికి ఆయన ఓ గొప్ప వరాన్ని అందించాడు. అదే మనకు జ్ఞాన మార్గాన్ని చూపించే ‘భగవద్గీత’. మనిషి మనిషిగా జీవించేందుకు, ధర్మబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ఇంతకంటే గొప్ప బహుమానం, వరం ఇంకేమైనా ఉంటుందా? అందుకే గీతా పారాయణం చేయాలంటారు పెద్దలు. గీతా పారాయణం చేద్దాం.. దేవుడిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకుందాం!

News December 1, 2025

ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

image

AP: దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది. పని జరిగే ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో అటెండెన్స్ తీసుకుంటారు. 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. రెండుమూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది.