News February 27, 2025

ముగిసిన మహాకుంభ్‌.. మోదీ ట్వీట్!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. ఈక్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘మహాకుంభ్ ముగిసింది. ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహాకుంభ్‌లో 1.4 బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది. గత 45 రోజులుగా దేశ నలుమూలల నుంచి కోట్ల మంది తరలిరావడాన్ని నేను చూస్తూనే ఉన్నా’ అని తన మదిలో మెదిలిన కొన్ని <>విషయాలను<<>> పంచుకున్నారు.

Similar News

News March 22, 2025

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

image

డీలిమిటేషన్‌పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. సమావేశానికి బెంగాల్ సీఎం మమత గైర్హాజరయ్యారు.

News March 22, 2025

రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

image

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.

News March 22, 2025

ఎర్త్ అవర్‌లో స్వచ్ఛందంగా పాల్గొనండి: CBN

image

AP: నేడు ఎర్త్ అవర్ సందర్భంగా గంట పాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని CM CBN పిలుపునిచ్చారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పునకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

error: Content is protected !!