News February 11, 2025

GBS కేసులపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

image

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

Similar News

News October 13, 2025

అంబేడ్కర్ ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశాలు.. 2 రోజులే ఛాన్స్!

image

TG: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి BA, B.Com, BSc కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు ఈనెల 15తో ముగియనుంది. ఇదే చివరి అవకాశం అని విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ 10+2 ఉత్తీర్ణులు అర్హులని చెప్పారు. విద్యార్థులు దరఖాస్తుల కోసం <>www.braouonline.in<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News October 13, 2025

విద్యార్థినులకు తోడ్పాటునందించే స్కాలర్‌షిప్

image

దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థినులకు యూ-గో సంస్థ స్కాలర్‌షిప్ అందజేస్తోంది. 10th, Interలో 70% మార్కులు సాధించి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు అర్హులు. సంవత్సరానికి 40వేలు అందిస్తారు. చివరి తేదీ అక్టోబరు 31. వెబ్‌సైట్: <>www.b4s.in/sen/RFS12<<>>

News October 13, 2025

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు వెంకటేశ్ నాయుడి(A-34) ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు సిట్‌కు ACB కోర్టు అనుమతినిచ్చింది. వెంకటేశ్ ఫోన్‌లో మరిన్ని ఆధారాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రేపు ఎఫ్ఎస్ఎల్‌లో ఫోన్ తెరవనున్నారు. లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించాడని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి. అతడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో అప్పట్లో వైరలైంది.