News February 11, 2025

GBS కేసులపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

image

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

Similar News

News February 7, 2026

కడప జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను అన్ని ప్రమాణాలతో వ్యర్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ, తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.

News February 7, 2026

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
*శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ నెయ్యి: సీఎం CBN
*TTD నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ చెప్పింది: జగన్
*KCRను జైల్లో వేయకుండా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?: CM రేవంత్
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు
*అగ్ని-3 సక్సెస్.. 3వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!
*పాకిస్థాన్‌లో సూసైడ్ బాంబింగ్.. 69 మంది మృతి

News February 7, 2026

భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

image

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.