News August 10, 2024
మహేశ్ బాబు మనసు బంగారం

మహేశ్బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సొంతూరు బుర్రిపాలెంలో నిన్న మహేశ్బాబు ఫౌండేషన్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించింది. 155 మందికి డాక్టర్లు వైద్యం చేసి, మందులు పంపిణీ చేశారు. ఇది 41వ క్యాంపు అని నిర్వాహకులు తెలిపారు. దీంతో సూపర్ స్టార్ మనసు బంగారమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె సర్జరీలు <<13811914>>చేయించిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News July 10, 2025
లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

లార్డ్స్లో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్లను నితీశ్ కుమార్ పెవిలియన్కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
News July 10, 2025
అకౌంట్లలోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

AP: ‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున వేస్తోంది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.
News July 10, 2025
త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.