News August 10, 2024
మహేశ్ బాబు మనసు బంగారం

మహేశ్బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సొంతూరు బుర్రిపాలెంలో నిన్న మహేశ్బాబు ఫౌండేషన్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించింది. 155 మందికి డాక్టర్లు వైద్యం చేసి, మందులు పంపిణీ చేశారు. ఇది 41వ క్యాంపు అని నిర్వాహకులు తెలిపారు. దీంతో సూపర్ స్టార్ మనసు బంగారమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె సర్జరీలు <<13811914>>చేయించిన<<>> విషయం తెలిసిందే.
Similar News
News July 6, 2025
ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
News July 5, 2025
54 ఏళ్ల తర్వాత..

భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్గా నిలిచారు. 1971లో వెస్టిండీస్పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.
News July 5, 2025
దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.