News October 2, 2024
2 లక్షల మార్కుకు చేరువగా మహీంద్రా థార్

నాలుగేళ్ల క్రితం లాంచ్ అయిన మహీంద్రా థార్ వాహన ప్రియుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్లలో 1.90 లక్షల వాహనాలను విక్రయించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ముగిసేలోపు 2 లక్షల మార్కును దాటేస్తామని ధీమా వ్యక్తం చేసింది. థార్ త్రీ-డోర్ వాహనం కాగా.. ఐదు తలుపులతో కూడిన థార్ రాక్స్ను మహీంద్రా ఈ ఏడాది తీసుకొచ్చింది. దానికీ అమ్మకాలు భారీగానే ఉండటం విశేషం.
Similar News
News October 28, 2025
ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
News October 28, 2025
‘జీర్ణం వాతాపి జీర్ణం’ అని ఎందుకంటారు?

ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ప్రయాణికులను మోసం చేస్తూ ఉండేవారు. వాతాపి మేకగా మారి, వంటగా వడ్డింపబడి, భోజనం తర్వాత కడుపు చింపుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అగస్త్యుడు ఓనాడు వాతాపిని తిన్నాడు. ఇల్వలుడు వాతాపిని పిలవగా అగస్త్యుడు వాతాపి ఎప్పుడో జీర్ణమయ్యాడంటూ కడుపును రుద్దుతూ ‘జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు. దీని ఆధారంగా తిన్నది బాగా జీర్ణం కావాలని ఇలా చెప్పడం అలవాటుగా మారింది. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 28, 2025
రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, NZB, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.


