News January 14, 2025
మరికాసేపట్లో మకరజ్యోతి

మరికాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించేందుకు అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీగా శబరిమలకు చేరుకున్నారు. భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Similar News
News November 21, 2025
వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (1/2)

AP: రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ధాన్యాన్ని సులభంగా విక్రయించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సేవలను రైతులు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం.
☛ ధాన్యం అమ్మాలనుకునే రైతులు 7337359375 నంబరుకు HI అని మెసేజ్ పెట్టాలి.
☛ AI ద్వారా ప్రత్యేక వాయిస్ ఈ సేవలను ఎలా వాడుకోవాలో మీకు తెలుపుతుంది.
News November 21, 2025
వాట్సాప్ సేవలతో ధాన్యం విక్రయం ఎలా? (2/2)

☛ తర్వాత రైతు తన ఆధార్ నంబరు నమోదుచేసి పేరును ధ్రువీకరించాలి.
☛ ధాన్యం అమ్మాలనుకునే తేదీకి 3 ఆప్షన్లు ఇస్తుంది. వాటిలో ఒక తేదీ, సమయం ఎంపిక చేసుకోవాలి.
☛ తర్వాత దాన్యం రకం నమోదు చేసి, ఎన్ని బస్తాలు అమ్ముతారో తెలపాలి. ☛ ఓ మెసేజ్ ద్వారా రైతులకు ధాన్యం అమ్మకం స్లాబ్ బుక్ అయినట్లు కూపన్ కోడ్ వస్తుంది.
☛ ఈ కూపన్ కోడ్ తీసుకెళ్లి రైతు తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు.
News November 21, 2025
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.


