News January 29, 2025
పని మనుషుల భద్రత కోసం చట్టం చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

పని మనుషులు తప్పనిసరి శ్రామికవర్గమని సుప్రీంకోర్టు తెలిపింది. వారి హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా చట్టాలేమీ లేవంది. కొందరు యజమానులు, ఏజెన్సీలు వారిని దూషిస్తూ, దోపిడీ చేయడంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని పేర్కొంది. వారి రక్షణకు చట్టం చేసేలా సలహాల స్వీకరణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 6 నెలల్లోగా వారు రిపోర్టు ఇవ్వాలని, దాని ఆధారంగా చట్టం చేయాలని సూచించింది.
Similar News
News February 7, 2025
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. WAY2NEWSలో ఎక్స్క్లూజివ్గా

యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఉ.7 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ప్రతి అప్డేట్ను WAY2NEWS మీకు ఎక్స్క్లూజివ్గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్లో చూడవచ్చు.70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ BJPకే మొగ్గుచూపగా, కొన్ని AAPకూ అవకాశం ఉందని అంచనా వేశాయి.
News February 7, 2025
ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.
News February 7, 2025
ఇకపై ఫోన్లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.