News April 24, 2024
బుక్స్ను బెస్ట్ ఫ్రెండ్స్గా చేసుకోండి: స్మిత

‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి వీరేశలింగం. పుస్తక పఠనం విజ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు పుస్తకంలోని ఒక పేజీ అయినా చదవాలని చెబుతుంటారు పెద్దలు. ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ‘బుక్స్ను మీ బెస్ట్ ఫ్రెండ్స్గా చేసుకోండి’ అంటూ సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు.
#WorldBookDay
Similar News
News March 5, 2026
సంతానోత్పత్తికోసం ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’: CBN

AP: సంతాన లేమితో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. PPP మోడల్లో ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’లు ఏర్పాటు చేసి సబ్సిడీపై IVF సేవలు అందించాలని యోచిస్తున్నామన్నారు. ‘ఒకప్పుడు 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేట్ 1.5కి తగ్గిపోయింది. దీనివల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గి ఆర్థిక వృద్ధి పడిపోతుంది. టీనేజ్ గర్భధారణలు తగ్గించే చర్యలు చేపడుతున్నాం’ అని CBN పేర్కొన్నారు.
News March 5, 2026
తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయ్..

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. <
Share It
News March 5, 2026
మిడిల్ ఈస్ట్లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.


