News February 4, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టులో మార్పులు చేయండి: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని మాజీ ప్లేయర్ అశ్విన్ సూచించారు. ఇంగ్లండ్‌తో టీ20ల్లో వరుణ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వన్డేల్లో అరంగేట్రం చేయని వరుణ్‌కు ఎల్లుండి నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. కాగా CTకి ప్రకటించిన భారత జట్టులో తుది మార్పులకు ఫిబ్రవరి 11వరకు అవకాశముంది.

Similar News

News February 8, 2026

NZB మేయర్ BJP గెలిస్తే ప్రధాని వస్తారు: రఘునందన్ రావు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేరళ తిరువనంతపురంలో మేయర్ అభ్యర్థి గెలిస్తే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారని గుర్తు చేశారు. అలాగే ఇక్కడికి వస్తారని హామీ ఇచ్చారు.

News February 8, 2026

ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.

News February 8, 2026

రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

image

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.