News March 29, 2024
టీడీపీలో చేరిన మల్లెల రాజేశ్
AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడు టీడీపీలో చేరారు. నారా లోకేశ్ సమక్షంలో ఆయనతో పాటు 10 మంది కౌన్సిలర్లు, ఒక జడ్పీటీసీ, ఇద్దరు సర్పంచులు టీడీపీ కండువా కప్పుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త పదవి నుంచి వైసీపీ తొలగించినప్పటి నుంచి రాజేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ కోసం మంత్రి రజనీ తన వద్ద రూ.6కోట్లు తీసుకున్నారంటూ ఆయన చేసిన <<12839437>>ఆరోపణలు <<>>దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Similar News
News January 17, 2025
ACCIDENT: 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.
News January 17, 2025
ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!
రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్), నాలుగో ప్లేస్లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.
News January 17, 2025
BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.