News November 15, 2024

IPL ఆక్షనీర్‌గా మల్లికా సాగర్?

image

ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వాహకురాలిగా మరోసారి మల్లికా సాగర్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2023 వేలం కూడా ఆమెనే నిర్వహించారు. ఐపీఎల్ చరిత్రలోనే వేలం ప్రక్రియను పూర్తి చేసిన తొలి మహిళగా మల్లికకు రికార్డు ఉంది. గత వేలంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక విధానానికి ప్రశంసలు రావడంతో మళ్లీ ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్. కాగా WPL వేలం నిర్వాహకురాలిగా కూడా ఆమె వ్యవహరించారు. ఈ నెల 24న జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.

Similar News

News March 17, 2026

‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

image

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 17, 2026

వంటింటి చిట్కాలు

image

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.

News March 17, 2026

ఒత్తిడి పెరిగితే.. అందం తగ్గిపోతుంది

image

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.