News January 8, 2025
రామమందిరంలోకి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్

అయోధ్య రామమందిరంలోకి ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాతో ప్రవేశించాడు. కళ్ల జోడుకు ప్రత్యేకంగా అమర్చిన కెమెరాలతో మందిరంలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ అధికారులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వడోదరకు చెందిన జైకుమార్గా గుర్తించారు. కాగా మందిరంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం.
Similar News
News November 14, 2025
విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ్టి ఎగ్జామ్ వాయిదా

AP: రాష్ట్రంలోని యాజమాన్య స్కూళ్లలో ఇవాళ నిర్వహించే <<18204293>>సమ్మెటివ్-1<<>> పరీక్ష వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. బాలల దినోత్సవం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 1-5 తరగతులకు సంబంధించిన ఎగ్జామ్ ను ఈ నెల 17న, 6-10 తరగతులకు సంబంధించిన పరీక్షను తిరిగి ఈ నెల 20న నిర్వహిస్తామని వెల్లడించింది.
News November 14, 2025
టీచర్లందరికీ టెట్ కంపల్సరీ.. విద్యాశాఖ ఉత్తర్వులు

తెలంగాణలో ఇకపై ఇన్-సర్వీస్ టీచర్లు కూడా <<18277875>>టెట్<<>> క్వాలిఫై అయి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు సర్వీస్లో ఉండాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 2009 తర్వాత నియమితులైన 30 వేల మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న 2 ఏళ్లలో వీరంతా టెట్ పాస్ కావాలని అధికారులు తెలిపారు.
News November 14, 2025
తెలంగాణ రౌండప్

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..


