News March 16, 2025
కన్నప్ప స్వగ్రామానికి మంచు విష్ణు

సినీ నటుడు మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప స్వగ్రామాన్ని సందర్శించారు. తన మూవీ టీమ్తో కలిసి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్కుమార్తో పాటు ఇతర స్టార్లు నటించారు.
Similar News
News April 23, 2025
విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. PSR ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిపోర్టు వెల్లడించింది. అటు PSRను విజయవాడ జైలుకు తరలించారు.
News April 23, 2025
నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

పహల్గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్స్టాలో క్యాప్షన్గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
News April 23, 2025
IND, PAK మధ్య ఇక క్రికెట్ వద్దు: మాజీ క్రికెటర్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో PAKపై IND మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైరయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. IND, PAK మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచులు నిర్వహించవద్దని BCCIని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్గామ్ వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. CT కోసం పాక్కు IND జట్టును BCCI పంపకపోవడాన్ని సమర్థించారు.