News November 18, 2024
మణిపుర్ మంటలు: కశ్మీర్ దారిలో వెళ్లనున్న కేంద్రం!

<<14644158>>మణిపుర్లో<<>> శాంతి స్థాపనకు కేంద్రం జమ్మూకశ్మీర్ స్ట్రాటజీని అమలు చేయనుందని సమాచారం. ఇందుకోసం ఏడాది గడువు నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త సీఎంను నియమించడం లేదా రాష్ట్రపతి పాలన విధించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముందు కుకీ మిలిటెన్సీ అనుకూల అధికారుల్ని గుర్తించి వ్యవస్థను ప్రక్షాళన చేయనుంది. సాయుధ బలగాలతో కుకీ టెర్రరిస్టులను ఏరేస్తూ మయన్మార్ బోర్డర్ను పటిష్ఠంగా మార్చనుంది.
Similar News
News January 27, 2026
అప్పుడే ఎండలు మొదలయ్యాయ్

AP: రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం నందిగామలో గరిష్ఠంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరకోస్తాలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం గమనార్హం.
News January 27, 2026
పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.
News January 27, 2026
రామకృష్ణ తీర్థం: వీరికి అనుమతి ఉండదు

రామకృష్ణ తీర్థానికి చేరుకోవడానికి అడవి మార్గంలో కఠినమైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే 10 ఏళ్లలోపు పిల్లలను, 50 ఏళ్లు పైబడిన పెద్దలను ఈ యాత్రకు అనుమతించరు. మార్గం సజావుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు, ఉబ్బసం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వెళ్లకపోవడం మంచిది. ఈ యాత్రలో ఎక్కువ గంటల పాటు నడవాల్సి ఉంటుంది. అందువల్ల శారీరక దృఢత్వం చాలా అవసరం. భద్రతా దృష్ట్యా ఈ నియమాలను పాటించడం క్షేమకరం.


