News December 27, 2024

తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్

image

తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.

Similar News

News February 22, 2026

USతో ట్రేడ్ డీల్‌పై చర్చలు వాయిదా

image

అమెరికాతో భారత్ ట్రేడ్‌ డీల్‌పై జరగాల్సిన చర్చలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరగాల్సి ఉంది. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్స్‌ను కొట్టివేసిన నేపథ్యంలో ఈ వాయిదా చర్చనీయాంశమైంది. మారిన పరిణామాలను పరిశీలించి మళ్లీ చర్చించేందుకు ఇరు పక్షాలు అంగీకరించినట్లు సమాచారం. కాగా FEB 24 నుంచి 150 రోజుల పాటు 15% టారిఫ్స్ అమలవుతాయని ట్రంప్ ప్రకటించారు.

News February 22, 2026

తిరుమల వ్యవహారం.. SCలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి SCలో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, CM చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు ఈ పిటిషన్‌ను విచారించనుంది.

News February 22, 2026

బానిసత్వ మనస్తత్వం వీడాలి.. దేశ సంస్కృతిని గౌరవించుకోవాలి: మోదీ

image

బానిసత్వ మనస్తత్వం వీడి భారతీయ సంస్కృతిని గౌరవించుకోవాలని PM మోదీ పిలుపునిచ్చారు. రేపటి నుంచి MAR 1 వరకు రాష్ట్రపతి భవన్‌లో ‘రాజాజీ ఉత్సవం’ నిర్వహించనున్నట్లు ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో తెలిపారు. AI సమ్మిట్ గురించి ప్రస్తావించారు. AIలో దేశ పురోగతి, యానిమల్ హెల్త్ కేర్&అగ్రికల్చర్‌లో టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఈ నెల 24న TN మాజీ సీఎం జయలలిత జయంతి నేపథ్యంలో ఆమె సేవలను గుర్తుచేశారు.