News August 20, 2024
నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్: KTR

TG: సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయలేరని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు KTR కౌంటర్ ఇచ్చారు. ‘నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్. మేం అధికారంలోకి వచ్చిన రోజునే అంబేడ్కర్ సచివాలయ పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగిస్తాం. మీ లాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతారని మేం అనుకోవట్లేదు. మీ మానసిక ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: అంతా వారి డైరెక్షన్లోనే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్శాఖలో డాక్యుమెంట్ రైటర్ల దందా నడుస్తోంది. జిల్లాలో 11సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లు ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. ఇదే అదునుగా రైటర్లు దండుకుంటున్నారు. 250 మందికి పైగా రైటర్లు ఇదే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై రూల్స్కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<
News November 16, 2025
వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>


