News April 10, 2025
మార్స్ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి: సైంటిస్ట్

అంగారక గ్రహంపై నివాసానికి పోలిష్ అకాడమీ శాస్త్రవేత్త ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారక గ్రహాన్ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి అని సూచించారు. తద్వారా అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మార్స్పై CO2 అధికంగా ఉండటంతో దానిపై మనుషులు జీవించడం సాధ్యపడదు. ఊర్ట్ క్లౌడ్లోని ఓ మంచు గ్రహశకలం అంగారకుని దగ్గరికి చేరుకోవాలంటే 15వేల సంవత్సరాలు పడుతుందట.
Similar News
News December 15, 2025
అశ్వినీ వైష్ణవ్తో లోకేశ్ భేటీ

AP: విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. స్కిల్ అసెస్మెంటులో AI టెక్నాలజీ ఆధారిత పోర్టల్, పైలెట్ ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. రాష్ట్ర నైపుణ్య గణనకు సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో InnoXR యానిమేషన్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితోనూ లోకేశ్ సమావేశమయ్యారు.
News December 15, 2025
IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్

IPL మినీ ఆక్షన్లో ఓవర్సీస్ ప్లేయర్ల హైయెస్ట్ ప్రైస్ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ₹18Crగా నిర్ణయించింది. ఒకవేళ వేలంలో సదరు ప్లేయర్ అంతకంటే ఎక్కువ ధర పలికినా అతడికి ₹18కోట్లే చెల్లిస్తారు. దానిపై మిగిలిన మొత్తం BCCIకి వెళ్తుంది. ఆ డబ్బును ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఉపయోగిస్తారు. కాగా IPL-2026 మినీ వేలం రేపు అబుదాబిలో మ.2.30 గంటల నుంచి జరగనుంది. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.
News December 15, 2025
3 సార్లు ‘ఓట్ చోరీ’ చేశారు.. రాహుల్కు BJP కౌంటర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఎక్కువ మద్దతు ఉన్న సర్దార్ పటేల్ స్థానంలో నెహ్రూ ప్రధాని అయినప్పుడు ఓట్ చోరీ జరిగింది. కోర్టు తీర్పు తర్వాత కూడా ఇందిరా గాంధీ ఎన్నికవడం వివాదాస్పద అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం లేకుండానే ఓటరు అయ్యారు’ అని ట్వీట్ చేసింది. రాహుల్ ఫేక్ ప్రాపగండాను తాము క్లీన్ చేస్తున్నామని మండిపడింది.


