News April 10, 2025

మార్స్‌‌ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి: సైంటిస్ట్

image

అంగారక గ్రహంపై నివాసానికి పోలిష్ అకాడమీ శాస్త్రవేత్త ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారక గ్రహాన్ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి అని సూచించారు. తద్వారా అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మార్స్‌పై CO2 అధికంగా ఉండటంతో దానిపై మనుషులు జీవించడం సాధ్యపడదు. ఊర్ట్ క్లౌడ్‌లోని ఓ మంచు గ్రహశకలం అంగారకుని దగ్గరికి చేరుకోవాలంటే 15వేల సంవత్సరాలు పడుతుందట.

Similar News

News April 25, 2025

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

image

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ADLB, నిర్మల్, MNCLలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా NZMBలోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

News April 25, 2025

ఇవాళ CSKvsSRH.. ఓడిన జట్టు ఖేల్ ఖతం

image

పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతున్న SRH, CSK మధ్య ఇవాళ సా.7.30కు కీలక మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ సన్నగిల్లుతుంది. 2 టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలతో ఇబ్బందిపడుతున్నాయి. హోంగ్రౌండులో ఆడుతుండటం CSKకు కలిసొచ్చే అంశం. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ చూపాలని CSK, కాటేరమ్మను గుర్తుతెచ్చుకుని అదరగొట్టాలని SRH అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుంది? మీ కామెంట్

News April 25, 2025

BRS సభకు వెళ్లకండి: RTC జేఏసీ

image

TG: తమ హయాంలో RTC కార్మికులకు అన్యాయం చేసిన BRS ఇప్పుడు వారిని పార్టీ సభకు రావాలని ఎలా పిలుస్తోందని RTC జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఫైరయ్యారు. కార్మికులు 55రోజులు సమ్మె చేస్తే 34మంది ప్రాణాలు కోల్పోయారని ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదన్నారు. 10ఏళ్ల పాలనలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగే BRS సభకు కార్మికులెవరూ వెళ్లొద్దని జేఎసీ నేతలు సూచించారు.

error: Content is protected !!